అధికారులపై మంత్రి హరీష్ ఆగ్రహం..

290
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్న సాగర్ పనులను పరిశీలించారు మంత్రి హరీష్ రావు. తొగుట మండలం తుక్కాపూర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను పరిశీలించారు.

దాదాపు 40 కిలోమీటర్ల మేర దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారుజ

తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల అసంపూర్తి పనులపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -