టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్లు..

390
minister vemula
- Advertisement -

నిజామాబాద్‌లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు. నిజామాబాద్ 8వ డివిజన్ కార్పొరేటర్ విక్రమ్ గౌడ్, 9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో జ‌రుగుతున్న అభివృద్దిని టీఆర్ఎస్‌లో చేరినట్లు వారు వివరించారు. ప్రజల నమ్మకాన్ని నిల‌బెట్టి నిజామాబాద్ కార్పొరేషన్ వార్డులను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

- Advertisement -