మిమ్మల్ని కాపాడుకుంటాం : మంత్రి హరీష్

196
harish rao
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి అండగా ఉండి కాపాడుకుంటామన్నారు మంత్రి హరీశ్ రావు. అంతేకాదు పనిచేసే ప్రతీ కార్యక్తను పార్టీ గుర్తిస్తుందని తెలిపారు. ఇటీవలే చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దానాబోయిన లక్ష్మీ బైక్ మీదుగా వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొని మృతి చెందింది.

harish rao given rythu bheema cheque

బాధిత కుటుంబాన్ని హరీష్‌రావు పరామర్శించారు. అనంతరం వారికి పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరు చేయించిన రూ.2 లక్షల ప్రమాద భీమా చెక్కును హరీశ్ రావు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోతే, పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి రూ.2 లక్షల ప్రమాద బీమా పార్టీ పక్షాన ఇస్తుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో గతంలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు అందించామని, కొత్తగా ఇద్దరి కార్యకర్తలకు ప్రమాద బీమా మంజూరు అయిందని వెల్లడించారు.

- Advertisement -