కెరళకు పాక్‌ సాయం…!

236
Kerala Floods
- Advertisement -

వరదలతో కెరళ సర్వం కోల్పోయింది. ఇప్పుడు వరదలు తగ్గముఖంపట్టడంతో కాస్త ఊరిపిల్చుకుంది. కాగా..సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులను నెమ్మదిగా ఇళ్లకు తరలివస్తున్నారు. కెరళ కష్టాలను చూసినవారంతా తమకు తోచినంత సాయం చేశారు. అయితే తాజాగా ..వరదలతో సర్వం కోల్పోయిన కేరళను ఆదుకునేందుకు దాయాది దేశం పాకిస్థాన్ ముందుకొచ్చింది.

 Imran Khan

కేరళ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. కేరళకు తమవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పాకిస్థాన్ ప్రజల తరపున కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అవసరమనుకుంటే తమవంతు మానవతా సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు.

- Advertisement -