సిద్ధిపేట వెన్నెలకు హరీష్‌ రావు అభినందనలు..

293
vennela reddy
- Advertisement -

మంత్రి హరీష్‌ రావు ఓ ప్రతిభావంతురాలైన విద్యార్థినిపై ప్రశంసలు కురింపించారు. సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామానికి చెందిన పురుమాండ్ల కొండల్ రెడ్డి, రేవతి దంపతుల పెద్ద కూతురు వెన్నెల రెడ్డి ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ఇటీవల బీఎస్పీ డిగ్రీ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ ఫారెస్ట్ ఉన్నత విద్య కోసం గత ఆగస్టు 27న ఎంట్రన్స్ పరీక్ష రాసింది. ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దిన బెనారస్ యూనివర్సిటీలో సీటు దక్కించుకుంది.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌ రావు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. వెన్నెలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ కోర్సులో ప్రవేశం పొందిన మొట్టమొదటి విద్యార్థినిగా సిద్ధిపేట జిల్లా ఖ్యాతిని చాటిందంటూ ఆయన కొనియాడారు. అంతేకాదు, అరుదైన కోర్సులో చేర్పించి, ఆమెను ప్రోత్సహించారంటూ వెన్నెల తల్లిదండ్రులు రేవతి, కొండల్ రెడ్డిలను కూడా హరీశ్ రావు అభినందించారు.

- Advertisement -