పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి: హరీష్‌

143
harishrao
- Advertisement -

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు…కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ మాట్లాడిన మాటలు సత్యదూరం అని మండిపడ్డారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి తెలంగాణ ప్రజలను అవమానించేలా అబద్దాలు మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ‌ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వ‌చ్చార‌ని… మంత్రులను కలిసేందుకు సమయం లేదు.. కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అని నిల‌దీశారు. రైతుల జీవితాలతో బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి వస్తారు..? అని నిల‌దీశారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే నైతికత మీకు ఎక్కడిది? అని ప్రశ్నించారు. పంజాబ్ లో వడ్లు కొన్నపుడు.. తెలంగాణ వడ్లు ఎందుకు కొనరని ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -