హాజీపూర్‌ సైకో..ప్రేమాయణం

491
srinivas reddy
- Advertisement -

హాజీపూర్‌ హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన రాచకొండ పోలీసులు శ్రీనివాస్‌రెడ్డి స్నేహితులను సైతం విచారిస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డితో పాటు లిఫ్ట్‌ మెకానిక్‌లుగా ఎవరెవరు పనిచేశారు..? ఆ సమయంలో ఇలాంటి అకృత్యాలకేమైనా పాల్పడ్డాడా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. 14 రోజుల పాటు రిమాండ్‌ గడువు ముగియగానే కోర్టు అనుమతితో మరోసారి మానవమృగం శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

మరోవైపు మర్రి శ్రీనివాస్‌రెడ్డిలో మరో కోణం బయటపడింది. ఎవరితోనూ కలివిడిగా ఉండకుండా ముభావంగా ఉండే శ్రీనివాస్‌రెడ్డి ప్రేమాయణ బయటపడింది.కన్నేసిన మైనర్లపై కీచక పర్వానికి దిగిన సైకో ఓ అమ్మాయి విషయంలో మాత్రం తీవ్ర నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఏడాదిన్నరగా పరిచయం ఉన్న ఓ యువతి విషయంలో మాత్రం అదుపు పాటించాడు.

శ్రీనివాస్ రెడ్డి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ని పరిశీలించిన అనంతరం ఆ అమ్మాయితో కలిసి తీసుకున్న ఫోటోలు కనిపించాయి. దీంతో వెంటనే ఆమెతో సంబంధం గురించి శ్రీనివాస్ రెడ్డిని విచారించారు పోలీసులు. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆ యువతి వేములవాడ దేవస్థానానికి వెళ్లిన సందర్భంగా పరిచయమైందని తెలిపారు. తాను ఆమెను ప్రేమించానని పెళ్లి చేసుకునే ఆలోచనతో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. ఒకవేళ ఆమె తన ప్రేమను తిరస్కరిస్తే అంతమొందించే వాడేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటివరకు తాను కన్నేసిన ముగ్గురు మైనర్లతో పాటు కర్నూలు నగరంలో ఓ వ్యభిచారిణిని మరో నలుగురితో కలిసి అంతమొందించాడు. మొత్తంగా హాజీపూర్ సైకో ఉదంతంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

- Advertisement -