నల్గొండలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ…

213
gutha
- Advertisement -

ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్ లను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవ్వాళ నల్గొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.నల్గొండ జిల్లాకు చెందిన 11 మంది లబ్ధిదారులకు 3,12,000 రూపాయల చెక్ లను అందజేశారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా కరోన పేషంట్స్ కి చికిత్సను అందిస్తూ ప్రజలను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని ఆయనతెలిపారు.

ప్రభుత్వ ,ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న పేద వారికి సీఎం ఆర్ ఎఫ్(CMRF) పథకం ద్వారా ఆర్ధిక సహాయం అందిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో పాటు నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -