ముగిసిన గ్రూప్-4 దరఖాస్తులు…

19
- Advertisement -

టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-4నోటిఫికేషన్ నేటితో ముగిసింది. 8180పోస్టులకు గాను సూమారుగా 9,51,321దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. నిజానికి జనవరి 30వ తేదీ నాటికి 8,47,277 దరఖాస్తులు రాగా మరియు అదే రోజు గడువు ముగిసింది. అయితే గ్రూప్‌-4ను టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పొడగించారు. దీంతో ఈ సంఖ్య దాదాపుగా 10లక్షలకు చేరువైంది. అయితే గ్రూప్-4 పరీక్షను జులై 1న ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా గ్రూప్-2,3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

మొక్కలు నాటిన తమిళ నటుడు..

సుప్రీంకోర్టు…కేంద్రంకు నోటీసులు

ముగిసిన బీఏసీ సమావేశాలు…

- Advertisement -