మొక్కలు నాటిన తమిళ నటుడు..

59
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇందులో భాగంగా ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు శశికుమార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశి కుమార్‌ మాట్లాడుతూ… మనం చేసే పనిలో మనం పొందే ఆనందం మొక్కల వల్ల కలిగే ఆనందంతో సమానమని అన్నారు.

మనం నాటిన మొక్కలు ఎదుగుతుంటే మనసు మన బిడ్డను పెంచుకుంటున్నట్టుగా అనిపిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన బాధలు తొలగించుకోవడానిక మొక్కలు నాటుదాం…వాటిని సంరక్షిద్దాం అని కోరారు. ఈ సందర్భంగా ఇంత గొప్ప అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

సుప్రీంకోర్టు…కేంద్రంకు నోటీసులు

ముగిసిన బీఏసీ సమావేశాలు…

ప్రపంచంలోనే టాప్ 1..తిరుమల మ్యూజియం

- Advertisement -