స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీ సంతోష్..

174
- Advertisement -

ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్‌లోని జాతీయగ్రామీణాభివృద్ధి ,పంచాయతీరాజ్ శాఖ (NIRD&PR) సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా NIRD&PR డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 75 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి 75 మెడిసినల్ ప్లాంట్స్ నాటాము. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందన్నారు.

ఎందరో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామై మొక్కలు నాటుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ కార్యక్రమాన్ని అభినందించారు. NIRD&PR క్యాంపస్‌లో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి.రాబోయే రోజుల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతాము అని నరేంద్ర కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న కార్యక్రమాలను సంతోష్‌కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించడం జరిగింది.వారు చేస్తున్న కృషిని చూసి సంతోష్‌ అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, NIRD&PR డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాధిక రస్తోగి,లెఫ్టినెంట్ కల్నల్ అశోతోష్ కుమార్ , రిజిస్ట్రార్ & డైరెక్టర్ (అడ్మిన్)..శశి భూషణ్, ప్రగతి రిసార్ట్ చైర్మన్ జిబికె రావు, డాక్టర్రవీందర్ ఇతర అధికారులు ,సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -