వ్యాక్సినేష‌న్‌పై కేంద్రం పూర్తి వివ‌రాలు వెల్లడి..

141
vaccination
- Advertisement -

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం..ఇప్పటివరకు దేశంలో వ్యాక్సినేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి వివ‌రాలు తెలిపింది. 60 ఏళ్లు పైబ‌డిన వారిలో 39.9 శాతం మందికి వ్యాక్సిన్లు వేసిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 45-60 ఏళ్ల మ‌ధ్య వారిలో 45.5 శాతం మంది వ్యాక్సిన్లు తీసుకున్న‌ట్లు చెప్పింది. 30-45 ఏళ్ల మ‌ధ్య వారిలో 9.4 శాతం మంది, 16-30 ఏళ్ల వారిలో 5.2 శాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు వివ‌రించింది.

మొత్తానికి 18-44 ఏళ్ల వారిలో 42 ల‌క్ష‌ల మందికి పైగా టీకాలు వేసిన‌ట్లు తెలిపింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో 18-44 ఏళ్ల వారిలో 3.28 ల‌క్ష‌ల మందికి టీకాలు వేసిన‌ట్లు వివ‌రించింది. తెలంగాణ‌లో 18-44 ఏళ్ల వారిలో 500 మందికి వ్యాక్సిన్లు వేసిన‌ట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అదే వ‌య‌సు వారిలో 2,624 మందికి వేసిన‌ట్లు తెలిపింది.

- Advertisement -