నల్గొండ ఐకేపీ సెంటర్‌ని పరిశీలించిన గవర్నర్ తమిళిసై..

93
tamilisai
- Advertisement -

నల్లగొండ శివారులోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ మరియు దుప్పల పల్లి ఐకెపి సెంటర్లను పరిశీలించారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. ధాన్యం కొనుగోళ్లపై రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఎంత ధాన్యం పండించారు? ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? అని అడిగి‌ తెలుసుకున్నారు గవర్నర్. మహిళా రైతును నేనెవరినీ అని అడిగి.. తనను తాను పరిచయం చేసుకున్నారు గవర్నర్.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. నల్లగొండ లో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందని పరిశీలించానని తెలిపారు. ఐకెపి సెంటర్ లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న..ఇప్పటి వరకు 72 శాతం పైగా కొనుగోలు జరిగిందన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు…ఈసారి వర్షం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు…ఈసారి సీజనల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు అని తెలిపారు గవర్నర్.

- Advertisement -