అమెరికాలో ఫైరింగ్…తెలుగు యువకుడు మృతి

7
- Advertisement -

అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. సౌత్‌ ఆర్కెన్సాస్‌లోని ఫోర్డీస్‌లో ఉంటూ అక్కడే మ్యాచ్‌ బుచర్‌ గ్రాసరీ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి గోపికృష్ణపై కాల్పులు జరిపాడు.

బుల్లెట్‌ తగలడంతో గోపీకృష్ణ కిందపడిపోగా ఆతర్వాత గోపీకృష్ణను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. గోపీ మరణవార్త తెలియడంతో అతని స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గోపికృష్ణ స్వస్థలం.

Also Read:తెల్ల వెంట్రుక పీకితే..మరిన్నిపెరుగుతాయా?

- Advertisement -