మొక్కలు నాటిన గూగుల్ డైరెక్టర్ శశాంక్ సాహ్ని…

473
google director shashank sahni
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాహుల్ జిందాల్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చందానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన గూగుల్ కంపెనీ డైరెక్టర్ శశాంకు సహ్ని.

ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా వేదిక ఈ విషయాన్ని తెలియ పరచడం జరిగింది తను చాలా రోజుల క్రితమే మొక్కలు నాటాలని అనుకున్నానని కరోనా వైరస్ ప్రభావం లాక్డౌన్ కారణంగా ఆలస్యం కావడం జరిగింది అని. ఈ రోజు నా నివాసంలో మూడు పండ్ల మొక్కలను నాటడం జరిగింది అని తెలిపారు.

ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లను నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు.ఈ సందర్భంగా మరొక నలుగురిని లేఖ శిష్ట ; విక్రాంత్ వర్షిని; ఆర్ఆర్ అంకూర్ గుప్త; మొహితు కపూర్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -