భారీగా పెరిగిన బంగారం ధర..!

229
gold rate
- Advertisement -

బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పరుగులు పెరిగి రూ.54,040కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.410 పెరిగి రూ.49,540కు చేరింది.

పసిడి బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.240 పెరిగి రూ.66,600కు చేరగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గుదలతో 1975 డాలర్లకు దిగొచ్చింది. వెండి ధర ఔన్స్‌కు 0.45 శాతం తగ్గుదలతో 28.46 డాలర్లకు దిగొచ్చింది.

- Advertisement -