గోవాలో కాంగ్రెస్‌కు షాక్‌..

66
congresss
- Advertisement -

గోవాలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్ వెల్లడించారు.

బీజేపీల చేరే వారిలో దిగంబర్‌ కామత్‌, మిచెల్‌ లోబో, డెలిలాహ్‌ లోబో, రాజేశ్‌ ఫల్‌దేశాయ్‌, కేదార్‌ నాయక్‌, సంకల్ప్‌ అమోన్కర్‌, అలెక్సియో సెక్వీరియ, ఉడాల్ఫ్‌ ఫెర్నాండేస్‌ ఉన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం ప్రమోద్‌ సావంత్‌తో భేటీ అయ్యారు. వీరు బీజేపీలో చేరికతో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది.

- Advertisement -