జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సన్నాహాలు..

204
ghmc
- Advertisement -

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌లకు సన్నాహాలు మొదలైయ్యాయి. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయం తెలపాలని ఎన్నికల కమీషన్‌ కోరింది. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఎన్నికల సంసిద్ధత, కోవిడ్‌ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లు, తదితర అంశాలపై చర్చించారు.మ‌రో నాలుగైదు నెల‌ల్లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈనెల 30వ తేదీలోపు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలో పేర్కొంది. ఈనెల 30వ తేదీ తరువాత ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకోబడవని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.

- Advertisement -