“పుష్ప 2” కోసం అక్కడ ఎగబడుతున్నారు ?

51
- Advertisement -

పాన్ ఇండియా లెవల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చేస్తున్న “పుష్ప 2 ది రూల్” సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది. తాజాగా పుష్ప-2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాకు మలయాళంలో భారీగా డిమాండ్ ఉందట. అక్కడ 30 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు టాక్ వినిపిస్తుంది. నిజంగా 30 కోట్ల బిజినెస్ అక్కడ జరిగితే.. అది రికార్డే.

మళయాళ స్టార్ హీరోల సినిమాలకే అక్కడ అంత మార్కెట్ ఉంది. అలాంటిది అల్లు అర్జున్ సినిమాకి ఆ రేంజ్ మార్కెట్ అవుతుంటే.. బన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కే. మరి మలయాళంలో పుష్ప 2 సినిమా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీ సంక్రాంతికి కాకుండా సమ్మర్ లో వస్తుందని రూమర్స్ మళ్ళీ వినిపిస్తున్నాయి.

Also Read: స్వయంభూ: ఫెరోషియస్ ఫస్ట్-లుక్ విడుదల

మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. మూవీ టీం క్లారీటి ఇచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్స్‌ కోసం ఇప్పటికే పీటర్‌ హెయిన్స్‌ భారీ సెట్స్ కూడా వేశారు. పుష్ప 2 లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందట

- Advertisement -