ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందట

35
- Advertisement -

శోభితా ధూళిపాళ్ల.. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన ఈ నటి ఆ వృత్తిని వదులుకోవడానికి తాజాగా కారణాలను వెల్లడించింది. ‘చిన్నప్పుడు మ్యాగజైన్లపై మోడల్స్ ఫొటోలు చూసి ఆశ్చర్యపోయేదాన్ని. నేను కూడా అలా కావాలని అనుకున్నా. కాలేజీ చివరి రోజుల్లో మిస్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్నా. కానీ, మోడలింగ్ నేను అనుకున్నంత ఆసక్తిగా అనిపించలేదు’ అని శోభితా వెల్లడించింది. కెరీర్‌లోనూ ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని చెప్పింది. శోభితా ధూళిపాళ్ల పక్కా తెలుగు అమ్మాయి.

బాలీవుడ్ లో అవకాశాలు అందుకుని, ప్రస్తుతం సౌత్ లో కూడా శోభితా ధూళిపాళ్ల వరుస సినిమాలు చేస్తోంది. తమిళ హీరో విశాల్, కార్తీల తో శోభితా ధూళిపాళ్ల నటించబోతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జోరుగానే సాగింది. అయితే తాజాగా ఈ తెలుగు బ్యూటీకి విక్రమ్ తో కలిసి నటించే అవకాశం దక్కింది. విక్రమ్ హీరోగా సుదర్శన్ దర్శకత్వంలో వస్తున్న ఓ మూవీలో శోభితా ధూళిపాళ్లని హీరోయిన్‌గా ఎంపిగా చేసినట్లు సమాచారం.

Also Read: మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్: గణేష్

అడవి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమాతో తెలుగు లో పరిచయమైన శోభితా ధూళిపాళ్ల ఇటీవల కాలంలో ప్లాప్ సినిమాలతో వెనకపడ్డా.. అవకాశాలు మాత్రం ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. పైగా హీరో నాగచైతన్యతో ఎఫైర్ పెట్టుకుందని రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. తాను ఎవరితో రిలేషన్ లో లేను అని శోభితా ధూళిపాళ్ల క్లారిటీ ఇచ్చింది.

Also Read: నాలుగేళ్ళు దాటితే మహేష్ ఫ్యాన్స్ కి నిరాశే

- Advertisement -