గాలి జనార్థన్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్‌

85
- Advertisement -

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన గాలి …సొంతంగా పార్టీ పెట్టి సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు. బెంగళూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గాలి.. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

నూతన పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించానని ఇకపై బీజేపీతో తన బంధం ముగిసిందని చెప్పుకొచ్చారు. కల్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ కర్ణాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు.

కర్నాటక అభివృద్ధే తన లక్ష్యం అని.. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తామన్నారు. త్వరలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని …తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -