12 నుండి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ మూసివేత..

412
koheda market
- Advertisement -

ఈనెల 12వ తేదీ నుండి కొత్తపెట్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి పేర్కొన్నారు.నిత్యం వేల సంఖ్యలో వ్యాపారులు కొనుగోలుదారులు వస్తుండడం, భౌతిక దూరం పాటించకపోవడం మార్కులు ధరించడం లేదు..వ్యాపారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు.

దీనికి తోడు హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉడడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.ప్పటివరకు కోహెడ లోని మార్కెట్ వద్ద అమ్మకాలు జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను పూర్తిగా శానిటేషన్ చేసి చిన్న చిన్న మరమ్మత్తుల పనులు కూడా మిగిలి ఉండడంతో అవి కూడా పూర్తి చేస్తాం అన్నారు.అప్పటివరకు రైతులు ఎవరు కూడా పండ్లు తీసుకుని గడ్డి అన్నారం మార్కెట్ కు రాకూడదన్నారు.

- Advertisement -