ఏపీలో 23,814కి చేరిన కరోనా…కంటైన్మెంట్‌ జోన్‌గా తిరుమల

165
corona ap
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1555 పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

ఇక ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,814కు చేరగా యాక్టివ్ కేసులు 11383 ఉన్నాయి. కరోనా నుండి 12154 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా 277 మంది మృత్యువాతపడ్డారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అయితే ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు.

- Advertisement -