రైతు కూలీలకు అండగా ఎంపీ సంతోష్ కుమార్

239
trs
- Advertisement -

దేశానికి వెన్నెముక రైతులు. లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుంబిగించారు. ఈరోజు నుండి లక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం ముందు రైతు కూలీలకు అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు గారు అన్నదాన కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు.

ఇది లాక్ డౌన్ పూర్తయ్యేంత వరకు కొనసాగుతుందని తెలిపారు. రైతు కూలీలు కాకుండా ఇతర పేద వారికి కూడా అన్నదానం చేస్తున్నాం.ఇంత మంచి కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి రైతు కూలీలు. కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేటర్స్, టిఆర్ఎస్ నాయకులు మరియు బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య ,ఎలుక అనిత ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మైన్ కరీంనగర్ , లక్ష్మి రాములు మార్కెట్ కమిటీ చైర్మైన్ బోయినపల్లి , అనుచరులు చాట్లపల్లి పురుషోత్తం పాల్గొన్నారు.

- Advertisement -