చందూలాల్ అంత్యక్రియలు.. మంత్రుల నివాళి..

225
minister errabelli
- Advertisement -

గురువారం రాత్రి అనారోగ్యంతో మరణించిన గిరిజన హక్కుల ఉద్యమ నేత,గులాబీ నేత మాజీ మంత్రి చందూలాల్ అంత్యక్రియలు ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ లంఛానాలతో నిర్వహించారు.ఈ అంత్యక్రియలకు ప్రభుత్వం తరుపున రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,స్త్రీ,శిశు సంక్షేమ,గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై చందూలాల్ దేహానికి నివాళులు అర్పించారు.

వారితో పాటు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్,మాజీ డిప్యూటీ సీఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఇతర అధికారులు,నేతలు హాజరై అంతిమ సంస్కారాలలో పాల్గొని ఘనంగా తుది వీడ్కోలు పలికారు.ఆ తరువాత వారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి గిరిజన ఉద్యమ నాయకుణ్ణి కోల్పోయామని,ఆయన చేసిన సేవలు మరువలేనివి అని వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

- Advertisement -