లోకాయుక్తగా ప్రమాణం చేసిన జస్టీస్ సీవీ రాములు

354
lokayuktha
- Advertisement -

తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములును, జిల్లా, సెషన్స్ విశ్రాంత న్యాయమూర్తి వి.నిరంజన్ రావును ఉపలోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు రాజ్ భవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై వీరికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -