తెలంగాణ భవన్ లో ఘనంగా క్రీస్మస్ వేడుకలు

435
Christamas in telanganabhavan
- Advertisement -

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో క్రీస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, పలువురు పాస్టర్లు పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రీస్మస్ పండుగ శుభాకాంక్షాలు తెలియజేసుకున్నారు.

ఈసందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 2001 నుండి ప్రతి సంవత్సరం తెలంగాణ భవన్ లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమదృష్టితో చూస్తున్నారు. రాష్ట్రంలో జరుపుకునే అన్ని పండగలను ప్రభుత్వ పరంగా జరిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందు, క్రిస్మస్ కానుకలు ఇవ్వడం సంతోషం అన్నారు. రాష్ట్రంలో ఎస్సి ,ఎస్టీ లతో సమానంగా క్రిస్టియన్ లకు ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నాం అని అన్నారు.

- Advertisement -