తృణమూల్‌లో చేరిన యశ్వంత్ సిన్హా…

256
tmc
- Advertisement -

బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి య‌శ్వంత్ సిన్హా ఇవాళ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అట‌ల్ బిహారీ వాయ్‌పేయి ప్ర‌భుత్వంలో య‌శ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా చేశారు. 83 ఏళ్ల య‌శ్వంత్ సిన్హా.. 2018లో బీజేపీకి స్వ‌స్తి ప‌లికారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే బెంగాల్‌లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన యశ్వంత్ సిన్హా…ప్ర‌స్తుతం దేశంలో అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని య‌శ్వంత్ సిన్హా ఆరోపించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల దృఢ‌త్వంలోనే ప్ర‌జాస్వామ్యం బ‌లం ఉంటుంద‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌తో పాటు అన్ని వ్య‌వ‌స్థ‌లు బ‌ల‌హీన‌మైన‌ట్లు య‌శ్వంత్ తెలిపారు.

- Advertisement -