ఆర్సీబీకి కొత్త కెప్టెన్‌గా ఫఫ్ డుప్లెసిస్‌..

223
- Advertisement -

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. సౌతాఫ్రికా మాజీ సారధి ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన “ఆర్సీబీ ఆన్‌బాక్స్‌” ఈవెంట్‌లో ఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఇక ఐపీఎల్‌-2021 తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ కోహ్లి సారథ్య బాధ్యతలు చేపట్టున్నాడని వార్తలు వినిపించాయి. ఆర్సీబీ తాజా ప్రకటనతో ఆ వార్తలకు బ్రేక్‌ పడింది.

కాగా, ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.. ‘‘ఇక నుంచి ఈ సింహాల గుంపుకు నాయకుడు ఇతనే’’ అంటూ డుప్లెసిస్ ఫొటోను రివీల్ చేసింది. ఇప్పటి వరకు డుప్లెసిస్ ఐపీఎల్‌లో 100 మ్యాచులు ఆడాడు. అతన్ని మెగావేలంలో రూ.7 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

- Advertisement -