కందికొండ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం..

145
- Advertisement -

శనివారం ప్రముఖ టాలీవుడ్‌ గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి చెందారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్‌ బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు.

కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -