న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ డౌగ్ బ్రేస్వెల్ డ్రగ్స్ పరీక్షలో పట్టుబడటంతో అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధించారు. 2025 సెప్టెంబర్లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఎసెక్స్ (Essex) జట్టు తరపున ఆడుతున్న సమయంలో ఆయన కోకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ నిషేధం విధిస్తున్నట్లు క్రికెట్ రెగ్యులేటర్ తెలిపింది.
సెప్టెంబర్ 2025లో సోమర్సెట్తో జరిగిన కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ సందర్భంగా బ్రేస్వెల్ నుండి నమూనాలను సేకరించారు. ఆ సమయంలో ఆయన నిషిద్ధ పదార్థం ‘కోకైన్’ వాడినట్లు పరీక్షల్లో తేలింది.మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత, అలాగే రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు తాను కోకైన్ తీసుకున్నానని 35 ఏళ్ల బ్రేస్వెల్ అంగీకరించారు.ఈ నిషేధం నవంబర్ 24, 2025 నుండి నవంబర్ 23, 2027 వరకు అమల్లో ఉంటుంది. బ్రేస్వెల్ ఈ శిక్షను అంగీకరించారు.
బ్రేస్వెల్ ప్రవర్తనను సమర్థించబోమని ఎసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ స్పష్టం చేసింది. “మా ఉద్యోగులందరూ వృత్తిపరమైన ప్రవర్తనలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని మేము కోరుకుంటాం. అయితే, బ్రేస్వెల్ పునరావాసం కోసం మా పాలసీల ప్రకారం అతనికి మద్దతుగా ఉంటాం” అని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.
బ్రేస్వెల్ ఇలా డ్రగ్స్ వివాదంలో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. 2024లో న్యూజిలాండ్ దేశవాళీ టీ20 టోర్నమెంట్లో కూడా ఇలాంటి ఉల్లంఘనకే ఆయన నెల రోజుల పాటు సస్పెన్షన్కు గురయ్యారు.2011 నుండి 2023 వరకు సాగిన తన అంతర్జాతీయ కెరీర్లో బ్రేస్వెల్ న్యూజిలాండ్ తరపున 28 టెస్టులు, 21 వన్డేలు మరియు 20 టీ20లు ఆడారు. మొత్తంగా 100కు పైగా వికెట్లు తీసి, దాదాపు 1,000 పరుగులు చేశారు. ఆయన తండ్రి బ్రెండన్, బాబాయి జాన్ కూడా న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెట్ కుటుంబానికి చెందిన వారు.
Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్కు హైకోర్టులో రిలీఫ్
రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో ఆయన మాట్లాడుతూ.. “నా దేశం తరపున ఆడటం నా జీవితంలో గర్వించదగ్గ విషయం. క్రికెట్ నాకు ఇచ్చిన అవకాశాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని” అని పేర్కొన్నారు.

