‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’.. మరో ప్రోమోతో యంగ్ టైగ‌ర్..

130
ntr
- Advertisement -

జెమినీ టీవీలో నాగార్జున‌, చిరంజీవి ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ అంటూ ఓ షోలో అల‌రించిన విష‌యం తెలిసిందే. అయితే ఈసారి ఈ షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు’ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ రియాలిటీ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నట్టు జెమినీ టీవీ అఫీషియల్‌గా ప్రకటించింది. ‘రండి గెలుద్దాం… ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ అంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డైలాగు చెప్పిన తొలి ప్రోమో కూడా ఇప్ప‌టికే విడుద‌లైంది. ఈ రోజు ఈ షో నుంచి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు.

ఈ ప్రోమో‌లో ఓ టీచర్ క్లాసులో పిల్లలను ఉద్దేశిస్తూ.. మీరు పెద్దయ్యాక ఏం అవుతారు అన్న ప్రశ్నకు ఒకరు కలెక్టర్ అవుతాను అంటే.. మరొకరు పైలట్ అని.. ఇంకొకరు ఛీఫ్ మినిష్టర్ అవుతాను చెబుతారు. కానీ ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుదామనుకుంటున్నాను అంటూ సమాధానిమిచ్చి టీజర్‌తో పాటు మిగతా వాళ్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కట్ చేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక నువ్వు ఏమైవుదానుకుంటున్నావు అనే ప్రశ్నకు ఓ విద్యార్ధిని నేను సీఏ చేస్తానంటోంది. కానీ అదే అమ్మాయి.. అమ్మను అవుతాను అంటూ చెబుతుంది.

తీరా షోలో ఎన్టీఆర్ అదే అమ్మాయిని మీరు ఏమవుదామనుకుంటున్నారు అనే ప్రశ్నకు నేను అమ్మను అవుతాను అంటూ సమాధానమిస్తోంది. మేము ముగ్గురుం ఆడపిల్లము.. అంటూ తన తల్లి పడిన కష్టాన్ని చెబుతోంది. ఈ సందర్భంగా రేపటి తరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యమంటూ సమాధానమివ్వడం ఆకట్టుకుంది. ఇక్కడ మనీతో పాటు మనసులు గెలుచుకోవచ్చు అంటూ ఎన్టీఆర్ చెబుతూనే.. ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది .. కోటి మీది .. రండి మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కాస్త ఎమోషనల్‌గా ఉంది ఈ ప్రోమో.

- Advertisement -