సివిల్స్ ర్యాంకర్‌ సంకీర్త్‌కి ఎర్రబెల్లి అభినందనలు..

319
errabelli
- Advertisement -

సివిల్స్ ఉత్తమ ర్యాంకర్ సంకీ ర్త్ కి ఫోన్ చేసి అభినందించారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు .దేశంలో 330 వంటి ఉత్తమ ర్యాంక్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో మిషన్ భగీరథలో ప్రస్తుతం ఏఈగా పనిచేస్తున్నారు సంకీర్త్.దేశంలో అత్యున్నత, అద్భుత, ఆదర్శ పథకంగా ఉన్న మిషన్ భగీరథ లో సంకీర్త్ లాంటి అణిముత్యాలు ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.సివిల్స్ లాంటి ఉన్నత ప్రమాణాలు గల పరీక్షలో ఉత్తమ ఫలితం సాధించడం సామాన్యం కాదు …దేశంలోనే ఉత్తమ ర్యాంక్ సాధించిన సంకీర్త్ ని మనస్ఫూర్తిగా గా అభినందిస్తున్నా అని తెలిపారు.

ఉద్యోగం చేస్తూనే, అత్యున్నత ఉద్యోగాన్ని సంపాదించడం సంకీర్త్ ప్రతిభకు నిదర్శనం…తెలంగాణ లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రతిభావంతులకు కొదువలేదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు. సంకీర్త్ రాష్ట్ర ఉద్యోగులందరికీ ఆదర్శంగా నిలిచారు…ఉద్యోగ వేటలో ఉన్న యువతకు సంకీర్త్ బాసట అదిలాబాద్ లాంటి వెనుబడిన జిల్లా నుంచి వచ్చిన సంకీర్త్ అందరికీ అండగా ఉండి, ప్రజలకు సేవ చేసి, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

- Advertisement -