పరిగిలో రైతువేదిక నిర్మాణ పనులకు శంకుస్ధాపన..

218
palla
- Advertisement -

తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు పరిగి ఎమ్మెల్యే కె మహేశ్వర్ రెడ్డి గారితో కలసి పరిగి మండలం లోని గడిసింఘాపుర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఈ వర్షాకాలం లో వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నమోదు చేసిన రైతులు వేసిన పంటల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సీఎం కెసిఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల లోని పలు గ్రామాలు క్షేత్ర స్థాయిలో రైతు పొలాలు సందర్శించి నమోదు చేసిన వివరాలు పరిశీలించారు.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తాము వేసిన పంటల సరైన వివరాలు వ్యవసాయ శాఖ కు ఇవ్వడం ద్వారా, పంటలు పండిన తరువాత ఆ యొక్క దిగుబడులు అమ్ముకోవడానికి సులభతరంగా ఉండటమే కాకుండా రైతు బంధు మరియు ఇతరత్రా పథకాలు పొందుటకు సులభంగా ఉంటుందని వివరించారు.

ఈ కార్యక్రమం లో పరిగి ఎమ్మెల్యే కె మహేశ్వర్ రెడ్డి గారు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీత, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ వీ లక్ష్మా రెడ్డి, ADA రమాదేవి, ADA వీరప్ప, ADA భారతి, AO కృష్ణ మోహన్, AEOలు , రైతులు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -