బ్రిడ్జి ప‌నులు ‌వేగంగా జరగాలి- మంత్రి ఎర్రబెల్లి

146
Errabelli Dayakar Rao
- Advertisement -

రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఈ రోజు ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రితో క‌లిసి కాజీపేట బ్రిడ్జి ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి కూలీలు, కాంట్రాక్ట‌ర్ల‌తో వారు మాట్లాడారు. ప‌నులు ఎప్ప‌టిలోగా పూర్తి చేస్తార‌ని మంత్రి వాక‌బు చేశారు. మ‌రో 10 నెల‌ల్లోగా ప‌నులు పూర్త‌వుతాయ‌ని మంత్రికి కాంట్రాక్ట‌ర్, ప‌ర్య‌వేక్ష‌కులు వివ‌రించారు.

Errabelli Dayakar Rao

బ్రిడ్జి ప‌నులు వేగంగా, నాణ్య‌త‌తో జ‌ర‌గాల‌ని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. కాజీపేట బ్రిడ్జి పూర్త‌యితే ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గ‌డ‌మేగాక‌, పాత బ్రిడ్జీపై కొంత భారం త‌గ్గుతుంద‌ని, ప్ర‌యాణీకుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు.

- Advertisement -