కేసీఆర్‌ కోసం ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధం- ఎర్ర‌బెల్లి

203
Minister-Errabelli-Dayakar-Rao
- Advertisement -

నేడు జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీర్వాదం నాకు ఎల్ల‌ప్పుడూ ఉండాలి.సీఎం కేసీఆర్‌కు నా ప్రాణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి అన్నారు.

న‌ల‌భై ఏండ్ల నా రాజ‌కీయ జీవితంలో అంద‌రూ న‌న్ను వాడుకున్నారు. ఏ ఒక్క‌రూ కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. కానీ ఈనాడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌య‌వ‌ల్లే నాకు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. ఆయ‌న ఆశీస్సుల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని బాగు చేసుకుంటున్నాను.కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంది. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వ‌ర‌కు మోటార్లకు మీట‌ర్లు ప‌రిస్థితి రాదని న‌మ్ముతున్నాను అని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు తెలిపారు.

- Advertisement -