మొక్కలు నాటిన నటి అమృత ప్రిన్సి…

177
Actress Amrutha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్టిస్ట్ అమృత ప్రిన్సి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్టిస్ట్ హరిత విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ నానక్ రామ్ గూడలో ఆర్టిస్ట్ అమృత ప్రిన్సి మొక్కలు నాటడం జరిగింది…అనంతరం మరో ముగ్గురు (ఆర్టిస్ట్ లు అను శ్రీ , ప్రియాంక , మౌనిక )లు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ స్వీకరించాలని ఆమె కోరారు.

- Advertisement -