భయపడకండి.. కరోనా తీవ్రత తగ్గింది..

252
Minister Errabelli
- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గింది.. భయపడకండి…హోంఐసోలేషన్‌లో ఉండండి అని సూచించారు మంత్రి. సర్కారు దవాఖానాలో ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోండి… కరోనా మహమ్మారిని జయించుదాం… అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సారి పండుగ చేసుకోలేదని బాధ పడకండి… వచ్చే సారి ఆరోగ్యవంతంగా పండుగ జరుపుకుందాం… అంటూ, మరో వైపు బాధితుల కష్ట సుఖాలు తెలుసుకుంటూ.. తనదైన శైలిలో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు, పోలీసులు తదితర అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తీవ్రత తగ్గింది. ఉదయం యోగా, రోజుకు రెండు, మూడు సార్లు అవిరి పడితే చాలు కరోనాను జయించవచ్చు అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కరోనా బాధితుల కష్టాల్లో పాలుపంచుకోవాలన్నారు. కరోనా బాధితులు వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. కరోనా వందల సంఖ్య నుంచి ఒకట్ల స్థానానికి పోయింది. అయిదారు రోజులుగా పరీక్షలు చేయగా, అయిదారు పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.

- Advertisement -