రిపబ్లిక్ డే వేడుకలకు గెస్ట్‌గా ఆదేశ అధ్యక్షుడు?

32
- Advertisement -

ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఏదో ఒక దేశ అధ్యక్షుడు చీఫ్ గెస్ట్‌గా రావడం అనవాయితీ. అలాగే ఈ ఏడాది జరిగే గణతంత్ర్య దినోత్సవ వేడుకలకు అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్ రానున్నారు.

రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్‌ ఆహ్వానించిందని తెలిపింది. వాస్తవానికి ఈ సారి రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బైడెన్‌ను ఆహ్వానించారు ప్రధాని.

అయితే, ఆయన ఈ వేడుకలకు హాజరుకాకపోవచ్చని తెలిసింది. దీంతో తాజాగా మాక్రాన్‌ను ఆహ్వానించింది. రిపబ్లిక్ డే వేడుకలకు మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోంది.

Also Read:IND VS SA ODI : సిరీస్ కైవసం..!

- Advertisement -