నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

30
- Advertisement -

హైదరాబాద్‌లో ఇవాళ పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు పోలీస్ అధికారులు.

వాహన దారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ కూడలి నుంచి బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం జెంక్షన్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు పంపిస్తారు.

అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి వైపునుంచి వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలివైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రిలోని ఎస్‌బీఐ నుంచి సుజాతా స్కూల్‌, చాపెల్‌ రోడ్డు వైపు పంపిస్తారు.ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్‌ కూడలి వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ నుంచి హిమాయత్‌నగర్‌ వైపు మళ్లిస్తారు.

Also Read:IND VS SA ODI : సిరీస్ కైవసం..!

- Advertisement -