క్రికెటర్ శిఖర్ ధావన్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నోటీసులు జారీ చేశారు. 1xBet బెట్టింగ్ యాప్ కేసులో షిఖర్ ధావన్కు ఈడీ సమన్లు జారీ చేసింది.
అక్రమ బెట్టింగ్ యాప్ 1xBetకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మాజీ భారత క్రికెటర్ షిఖర్ ధావన్ను ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. గురువారం ఆయనను హాజరు కావాలని ఆదేశిస్తూ వివరణ కోరనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Also Read:TTD:భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ధావన్ వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది. 39 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ 1xBet యాప్కు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ క్యాంపెయిన్లు, ఎండార్స్మెంట్లతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లింకులు ఏమిటో తెలుసుకునేందుకు ఈడీ ప్రశ్నలు అడగనుంది.
Also Read:TTD:భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు
అక్రమ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల రూపాయల విలువైన ప్రజలు, పెట్టుబడిదారులు మోసపోవడం, భారీగా పన్ను ఎగవేయడం వంటి అనుమానాలపై ఈడీ పలు కేసులు దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసులో గత నెలలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

