ఏపీ, తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా..

126
MLC Elections
- Advertisement -

తెలంగాణ 6, ఆంధ్రప్రదేశ్ 3 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో గడువు ముగుయనున్నది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటలో జూన్ 3వ తేదీతో ఆరు ఎమ్మెల్సీల స్థానాల గడువు ముగియనున్నది. ఈమేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఖాళీల‌పై ఇటీవ‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసింది. అయితే ఆ లేఖ‌పై చ‌ర్చించిన సీఈసీ ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు ఉండ‌వు అని గురువారం త‌మ నిర్ణ‌యాన్ని తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ,తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. సరైన సమయంలో కరోనా పరిస్థితులపై రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

వచ్చే నెలలో గడువు ముగుస్తున్న ఎమ్మెల్సీల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిఫ్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకరేశ్వర్లు ఉన్నారు. ఇక, గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి. కాగా, గవర్నర్ కోటాను భర్తీ చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో ఈ ఖాళీ భర్తీ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -