గ్రీన్ ఇండియా చాలెంజ్… మొక్కలు నాటిన దుల్కర్ సల్మాన్

111
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని దుల్కర్ సల్మాన్ పిలుపునిచ్చారు.

అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ దుల్కర్ సల్మాన్ కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

- Advertisement -