రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం…

206
balaraju
- Advertisement -

రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్ల ను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా గజ్జెల నగేష్ నియామకం అయ్యారు.

తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు…. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్ నియమితులయ్యారు.తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వలు వెలువడనున్నాయి.

- Advertisement -