ధనుర్మాసం ప్రత్యేకత

92
dhanurmasam
- Advertisement -

ధనుర్మాసం అంటేనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొలే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. గురువారం మధ్యాహ్నం ధనుర్మాసం గడియలు ప్రారంభం కావడంతో ఈ రోజు నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజ కైంకర్యాలు నిర్వహిస్తారు ఆలయ అర్చక్తులు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రాతినిధ్యం సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. కౌసల్య, సుప్రజా రామ సంధ్య ప్రవతథే అంటూ శ్రీవారిని మేల్కొల్పు ప్రారంభం అవుతుంది. కానీ ఈ ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతనికి బదులుగా తిరుప్పావై పఠనం చేసి శ్రీవారిని మేల్కొలుపుతారు ఆలయ అర్చకులు. శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాస్తురాలనే గోదాదేవి పాసురాలు అంటారు. ధనుర్మాస్త్రంలో సుప్రభాతనికి బదులుగా ఒక్కో పాసురాని ముప్పై రోజుల పాటు పాటిస్తూ శ్రీవారిని మేల్కొలుపుతారు అర్చకులు. నెలరోజులపాటు నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే తులసి నిర్వహిస్తారు. దళాలకు బదులుగా బిల్వపాత్రలతో మరోవైపు శ్రీవారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసునికి కాకుండా శ్రీకృష్ణ భాగవనికి ఈ నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఇలా నెల రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ప్రత్యేల పూజానివేదనలు నిర్వహిస్తారు. పరమభక్తురాలైన గోదాదేవి తరపున ఇప్పటికి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు మోహిని అవతారం సందర్భంగా శ్రీనివాసునికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారికి అలంకరించిన పుష్పమాలలు.., చిలుకలతో పాటు గరుడ సేవలో అలంకరించే తులసి మాలలు స్వామి వారికి సమర్పిస్తారు. ఇంకా ధనుర్మాసంలో నెల రోజుల పాటు గోదాదేవి రాసిన పాసురలను పాటించడం అనతికాలంగా వస్తుంన సంప్రదాయం. తిరిగి జనవరి 15వ తేదీ సుప్రభాత సేవను పునరుదరిస్తారు. నేటి నుంచి జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. కోవిడ్ కారణంగా ఇప్పటికే అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. తిరుప్పావైను ఏకాంతంగా బంగారు వాకిలి వద్ద పాటించనున్నారు వేదపండితులు.

ధనుర్మాసంలో స్వామి వారికీ ప్రత్యేక నైవేధ్యాని నివేదిస్తారు ఆలయ అర్చకులు. రోజు ఉదయం సాయంత్రం శ్రీవారికి దోసెలు నివేదిస్తు ఉంటారు. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం దోసెలు కాకుండా…. బెల్లం పాకంలో ఉంచిన ప్రత్యేక దోసెలని నివేదిస్తారు అర్చక స్వాములు. శ్రీవారినికి అనుగుణంగా ప్రసాదాలు నివేదించడం ఆనవాయితీ ఉంది. స్వామి వారివైభోగమే వైభోగం అంటారు భక్తులు

- Advertisement -