మొక్కలు నాటిన చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి…

263
dronavalli harika
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి మాదాపూర్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

ఇంతటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ పరమావధి గా సాగుతున్న ఈ యజ్ణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉందని హారిక తెలిపారు.

ఈ క్రమంలో, దీనిని ముందుకు తీసుకుపోయేందుకు, బ్యాడ్మింటన్ కోచ్ అరుణ్ విష్ణు , టెన్నిస్ క్రీడాకారిణి చిలుముల నిధి , మరియు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి లకు మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ చేశారు.

- Advertisement -