త్యాగానికి ప్రతీక బక్రీద్: హరీష్ రావు

640
harish rao
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీష్ రావు.ఈదుల్ అజ్ హా (బక్రీదు)పండుగ సందర్భంగా జిల్లా ముస్లిం సోదర ,సోదరీమణులకూ, ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ.. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ఈ బక్రీద్ పండుగ ఒకటని అన్నారు. ఈ పండుగ త్యాగానికి ప్రతీక నన్నారు.ప్రతి ఒక్కరూ బక్రీద్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మన జిల్లా నుండి మక్కాకు హజ్ యాత్రికులు వెళ్లే వారు కానీ కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర లేకపోవడం కొంత బాధాకరం ,అల్లా దయతో కరోనా సైతాన్ తరిమెద్దామన్నారు.. రేపు జరిగే బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులు కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్ద వారే ప్రజలంతా సంతోషంతో సుభిక్షంగా వుండాలని ప్రార్థన చేయాలన్నారు.

- Advertisement -