Puri:డబుల్ ఇస్మార్ట్ షురూ

27
- Advertisement -

బోయ‌పాటితో స్కంద సినిమా చేస్తున్న రామ్ పోతినేని త‌ర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ తో డ‌బుల్ ఇస్మార్ట్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఇవాళ అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్, రామ్, ఛార్మి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు చిత్రయూనిట్. జూలై 12 నుండి షూటింగ్ ప్రారంభంకానుందని వెల్లడించారు పూరి.

2019 లో పూరీజగన్నాధ్ , రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటిదాకా లవర్ బాయ్ ల అకనిపించిన రామ్ ఈ సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. అంతేగాదు భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్‌ని ప్రకటించారు పూరి.

Also Read:యాక్షన్ మోడ్‌లో రామ్ చరణ్‌!

డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024 లో రిలీజ్ చేస్తామని డేట్ కూడా అనౌన్స్ చేశాడు. ఇక లైగర్‌తో కోలుకోలేని దెబ్బతిన్న పూరి ..డబుల్ ఇస్మార్ట్‌తో తిరిగి ట్రాక్‌లోకి వస్తాడో లేదో వేచిచూడాలి.

Also Read:Pushpa 2:అనుకోని అతిథి!

- Advertisement -