నన్ను హీరోను చేయకండి:అభిజీత్

3
- Advertisement -

NEET పేపర్ లీక్‌పై వ్యక్తమైన తీవ్ర ఆందోళనలు, నిరసనల నడుమ ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ… “జంతర్ మంతర్ వద్ద మరియు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నుండి దేశవ్యతిరేక శక్తులు ప్రయోజనం పొందకుండా ఉండేందుకు, దేశ సమైక్యతను కాపాడేందుకు, భారతీయ విద్యార్థులు చట్టపరమైన చిక్కుల్లో పడకుండా తమ చదువులు, కెరీర్‌పై దృష్టి పెట్టేలా చేసేందుకే నేను ప్రధానికి నా రాజీనామా లేఖను సమర్పించాను అని తెలిపారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన అభిజిత్.. ఇది విద్యార్ధుల విజయం అన్నారు. నన్ను హీరోను చేయకండి, ఇది మన విజయానికి పడిన మొదటి అడుగు మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కాండిల్ లైట్ ర్యాలీ (మైనపువత్తుల ప్రదర్శన) మరియు మౌన ప్రదర్శన చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఇది భారతదేశ ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగ విలువల విజయం అని అభివర్ణించారు.

Also Read:యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా:ప్రధాన్

- Advertisement -