సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు..

176
cmrf 3
- Advertisement -

కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు అందించారు.

-తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరఫున 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఛైర్మన్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ ఛైర్మన్ వి.వెంకటరమణ, సెక్రటరి ఎన్. శ్రీనివాసరావు, మెంబర్ ఒ.ఎన్. రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు చెక్కును అందించారు. ఈ ఐదుగురు వ్యక్తిగతంగా మరో 2 లక్షల 50 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు.

-గ్రీన్ కో గ్రూప్ 5 కోట్ల రూపాయల విలువైన లక్ష పిపిఈ కిట్లు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను గ్రీన్ కో గ్రూప్ ఎం.డి అనిల్ చలమలశెట్టి సిఎం కేసీఆర్ కు అందించారు.

-మైత్రా ఎనర్జీ గ్రూప్ 2 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన పిపిఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను ఎం.డి. విక్రమ్ కైలాస్, డైరెక్టర్ వివేక్ కైలాస్ సిఎం కేసీఆర్ కు అందించారు.

-తెలంగాణ స్టేట్ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2 కోట్ల రూపాయల విలువై వైద్య పరికరాలను అందించడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను ప్రెసిడెంట్ లక్ష్మీనరసింహారావు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు అందించారు.

-శ్రీ రామచంద్ర మిషన్ 1 కోటి 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును జాయిన్ట్ సెక్రటరి వంశీ చలగుల్ల, డా. శరత్ కుమార్ ముఖ్యమంత్రికి అందించారు.

-ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును ఎం.డి. వెంకటేశ్వర రెడ్డి సిఎం కేసీఆర్ కు అందించారు.

– కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 7లక్షల 41 వేల రూపాయల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -